Telangana News: దోస్త్, ఇంజనీరింగ్‌ సీట్ల సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ తేదీల మార్పు

తెలంగాణాలో  కురుస్తున్న వర్షాల నేపథ్యంలో దోస్త్, ఇంజనీరింగ్‌ సీట్ల సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ తేదీలలో అధికారులు మార్పులు చేసారు. ఇంటర్నెట్ మరియు ప్రయాణ సమస్యల దృష్ట్యా ఈ మార్పులు చేసినట్లు అధికారులు చెప్పారు.

క్రొత్త షెడ్యూల్ ప్రకారం దోస్త్‌  మూడవ విడత సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు ఆఖరి తేదీని జూలై 21 నుంచి 26కు పొడిగించగా.. కాలేజీల్లో రిపోర్టు చేసే తేదీలను 22 నుంచి 26కు మార్చారు. ఇంట్రా కాలేజీలో బ్రాంచీల మార్పునకు 28 చివరి తేదీ ఉండగా, దీన్ని 31 వరకు పొడిగించారు.

అలాగే  ఇంజనీరింగ్‌ తొలి దశ సీట్ల కు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ తేదీని జూలై 23కు మార్చారు. కాగా సెలవుల తర్వాత తెలంగాణలో స్కూళ్ళు సోమవారం తెరుచుకోవాల్సి ఉంది.

Leave a Comment