చైనాలో జరిగిన ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించిన తొలి భారతీయురాలుగా C. A. భవానీ దేవి నిలిచింది. నిజానికి దీనికంటే ముఖ్యంగా ఆమె క్చార్తర్ ఫైనల్లో 15-10తో ప్రపంచ నంబర్ వన్ను మట్టికరిపించి మహిళల సెబర్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఒలింపియన్ భవానీ దేవి ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ మిసాకి ఎమురాను ఓడించి, ఈవెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.
అయితే భవాని సెమీఫైనల్లో ఉజ్బెకిస్థాన్కు చెందిన జైనబ్ దయిబెకోవా చేతిలో 15-14 తేడాతో ఓడి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.
భారత ఫెన్సర్ భవానీ దేవి విజయం సాధించినందుకు కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఆమెను అభినందించారు. మిస్టర్ ఠాకూర్ ఒక ట్వీట్లో, భవానీ దేవి ఒక ట్రయల్బ్లేజర్గా మరియు తోటి క్రీడాకారులకు స్ఫూర్తిగా అభివర్ణించారు. భవానీ దేవి క్రీడకు తగిన గుర్తింపు తెచ్చిందన్నారు.